సీఎం జగన్పై జరిగిన దాడి కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. సీఎం జగన్పై రాయి విసిరిన నిందితుడు వేముల సతీష్తో పాటు అతన్ని సపోర్ట్ చేసిన వేముల దుర్గారావు, ఇతర అనుమానిత యువకులు వడ్డెర కులానికి చెందిన వారట. దాంతో ఈ వ్యవహారం కులం రంగు పులుముకుంటోంది. వైసీపీ ప్రభుత్వం తమ రాజకీయాల కోసం వడ్డెర కులాన్ని టార్గెట్ చేస్తోందని కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.