ఇంటర్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు శుభవార్త చెప్పింది. ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు అపరాధ రుసుముతో ఈ నెల 10 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించింది. ఆలస్య రుసుముగా రూ.2,500 చెల్లించి.. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్
విద్యార్థులు ఫీజు చెల్లించొచ్చని తెలిపింది. రెగ్యులర్ అభ్యర్థులతో పాటు ప్రైవేటు అభ్యర్థులు కూడా పరీక్షఫీజు చెల్లించొచ్చని పేర్కొంది.