AP: వైసీపీలో చేరిన మాజీ ఎంపీ శాంత

60చూసినవారు
AP: వైసీపీలో చేరిన మాజీ ఎంపీ శాంత
మాజీ లోక్‌స‌భ ఎంపీ జె. శాంత వైసీపీలో చేరారు. మంగళవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జ‌గ‌న్ సమక్షంలో ఆమె వైసీపీ కండువా కప్పుకొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన శాంత వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వారు. ఆమె 2009లో లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. సీఎం జ‌గ‌న్ అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలకు ఆయనపై అపారమైన నమ్మకం ఏర్పడిందని, అందుకే వైసీపీలో చేరానని శాంత పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్