ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది. ఈ సంవత్సరం ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తున్నట్లు తెలిపింది. రేపు ఉదయం తాడేపల్లిలోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో విడుదల చేయనున్నారు. మీ ఇంటర్ ఫలితాలను https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోండి.