ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షల హాల్ టిక్కెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు https://bieap.apcfss.in/ వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీ ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనుండగా.. 10 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 5,29,457 మంది ఫస్ట్ ఇయర్, 4,76,198 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు.