రాష్ట్ర వ్యాప్తంగా రేపు 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమం రెండో దశ ప్రారంభం కానుంది. రెండవ దశలో తొలుత గ్రామీణ ప్రాంతాలలో, 3వ తేదీ నుంచి పట్టణ ప్రాంతాలలో హెల్త్ క్యాంపులు మొదలవుతాయి. ఆరు నెలల పాటు సాగే ఈ కార్యక్రమంలో 13,945 ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నారు. ఇందుకోసం పీ వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది.