AP: మరణంలోనూ వీడని భార్య, భ‌ర్త‌ల బంధం

130922చూసినవారు
AP: మరణంలోనూ వీడని భార్య, భ‌ర్త‌ల బంధం
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కడివేడు దళితవాడలో విషాదం నెల‌కొంది. గ్రామానికి చెందిన రమణమ్మ(60) అనారోగ్య స‌మ‌స్య‌లతో శనివారం వేకువజామున మృతి చెందింది. ఈ విషయాన్ని గమనించిన ర‌మ‌ణ‌మ్మ భ‌ర్త నాగూరయ్య(68), కుటుంబ సభ్యులను మేల్కొలిపి, తాను ఓ చోట అలా కూర్చుండి పోయాడు. మ‌రికాసేప‌టికి నాగూరయ్యను కుటుంబ సభ్యుల కదిలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే ఆయన ప్రాణాలు విడిచి ఉన్నాడు.

సంబంధిత పోస్ట్