మూడోసారి ప్రధానిగా మోడీ ఆదివారం రాత్రి 7.15కి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మోడీ కేబినెట్లో ఇద్దరికి చోటు దక్కలేదని తెలుస్తోంది. అనురాగ్ ఠాకూర్, పురుషోత్తమ్ రూపాలాను కేబినెట్లోకి మోడీ తీసుకోలేదని సమాచారం. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అనురాగ్ ఠాకూర్కు ఇస్తారనే అంచనాలు ఉన్నాయి. రాజ్పుత్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పురుషోత్తమ్ రూపాలాకు కేంద్ర మంత్రి పదవి దక్కలేదు.