సీఎం జగన్‌పై దాడి.. నిఘా విభాగం కీలక సూచనలు

566చూసినవారు
సీఎం జగన్‌పై దాడి.. నిఘా విభాగం కీలక సూచనలు
సీఎం జగన్‌పై రాయి దాడి ఘటన నేపథ్యంలో ఆయన భద్రతపై నిఘా విభాగం కీలక సూచనలు చేసింది. సభల్లో ర్యాంప్ వాక్ చెయ్యొద్దని జగన్‌కు భద్రతాపరమైన సూచనలు చేసింది. జగన్ బస్సు పరిసరాల్లో అనుమతిపై ఆంక్షలు విధించనున్నారు. జగన్‌కు, జనానికి మధ్య బారికేడ్లు ఉండాలని పేర్కొంది. క్రేన్లు, ఆర్చులు, భారీ గజమాలలు తగ్గించాలని నిఘా విభాగం సూచించింది. వీలైనంత వరకు బస్సులోనే ఉంటూ రోడ్ షోలు నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది.

సంబంధిత పోస్ట్