పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తీహార్ జైలులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఆయన కలవనున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో సీఎం కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్ రిమాండ్ నేటితో ముగియనుంది. దీంతో ఆయనను కోర్టులో ED ప్రవేశపెట్టనుంది.