సీఎం జగన్పై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ స్పందించారు. 'ఈ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధ్యులను శిక్షించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నా' అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇక 'రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్? ఇంకెక్కడి నుంచి వస్తా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా!' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్ అంటూ 2019లో కోడికత్తి, 2024లో రాయి అని వాటి ఫొటోలు పోస్ట్ చేశారు.