ఒకే రోజు ముగ్గురు బాలికలపై అత్యాచారయత్నం: వైసీపీ

68చూసినవారు
ఒకే రోజు ముగ్గురు బాలికలపై అత్యాచారయత్నం: వైసీపీ
మంత్రి నారా లోకేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఒకే రోజు ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారయత్నం జరిగిందని ఆరోపించింది. ఎక్స్ వేదికగా.. నియోజకవర్గంలోని ఆత్మకూరు, మంగళగిరి పట్టణాలతోని రత్నాల చెరువు, బాలాజీ నగర్‌లో మైనర్ బాలికలపై కామాంధులు అత్యాచారానికి యత్నించారని పేర్కొంది. శాంతి భద్రతను గాలికి వదిలేసి.. కామాంధులకు లైసెన్స్ ఇచ్చావా లోకేష్ అంటూ వైసీపీ ప్రశ్నించింది.

సంబంధిత పోస్ట్