2014 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు తాను ఇచ్చిన హామీలను సీఎం అయ్యాక నేరవేర్చలేదని సీఎం జగన్ విమర్శించారు. "రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? పగటిపూట 12 గంటల ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నాడు.. విడిపించాడా? రైతులకు సున్నా వడ్డీ, ఇన్ఫుట్ సబ్సిడీ ఎగ్గొట్టేశాడు. రైతన్నకు బాబు చేసిందేమీ లేదు." అని జగన్ పేర్కొన్నారు.