స్వచ్చ గుంటూరు సాధనకు కమిషనర్ పిలుపు

63చూసినవారు
స్వచ్చ గుంటూరు సాధనకు కమిషనర్ పిలుపు
గుంటూరును స్వచ్చ నగరంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం కమిషనర్ ఛాంబర్, కౌన్సిల్ సమావేశ మందిరంలో ఐటీసీ ఎంఎస్కె అండ్ ఫినిష్ సొసైటీ రూపొందించిన స్వచ్చత హి సేవా పోస్టర్స్ ని కమిషనర్ ఆవిష్కరించారు. స్వచ్చత హి సేవాలో భాగంగా నేటి నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు స్వచ్చ గుంటూరు సాధనకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్