గుంటూరులో చిరువ్యాపారుల కోసం ఆందోళన

58చూసినవారు
గుంటూరులో చిరువ్యాపారుల కోసం ఆందోళన
చిరు వ్యాపారులను బెదిరించి, షాపులు ధ్వంసం చేసిన హోటల్ నిర్వాహకుల పై చర్యలు తీసుకోవాలని ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు కరీమ్ డిమాండ్ చేశారు. గత 25 ఏళ్లుగా గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద చిరు వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారస్థులను స్థానిక మాధవన్ హోటల్ నిర్వాహకులు బెదిరించి, షాపులను ధ్వంసం చేశారని ఆరోపించారు. దీనిపై శుక్రవారం కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం ఆందోళన చేపట్టింది.

సంబంధిత పోస్ట్