ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించం: శైలజ

60చూసినవారు
ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించం: శైలజ
గుంటూరు జిల్లాలో ఈనెల 3వ తేదీ నుంచి 21 వరకు ఏపీ టెట్ జరగనున్న పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి పి. శైలజ మంగళవారం ప్రకటనలో తెలిపారు. మొత్తం 18, 476 మంది హాజరు కానుండగా, నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. రోజూ ఉదయం 9. 30, మధ్యాహ్నం 12, మధ్యాహ్నం 2. 30, సాయంత్రం 5 గంటల వరకు రెండు విడతలుగా కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్ష ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్