గుంటూరులో వీధి వ్యాపారుల కన్నీటి రోదన

51చూసినవారు
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద దుకాణాలు తొలగిస్తున్న నేపథ్యంలో శనివారం వీధి వ్యాపారులు ఆందోళన చేపట్టారు. పొట్టకూటి కోసం పెట్టుకున్న దుకాణాలు తొలగిస్తే ఆధారం కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ ఉద్దేశ్య పూర్వకంగానే దుకాణాల్లో తాము గంజాయి విక్రయిస్తున్నామని అభాండాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వ్యాపారులు వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్