పిడుగురాళ్ల: పారిశుధ్యం పై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి

53చూసినవారు
పిడుగురాళ్ల: పారిశుధ్యం పై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి
పారిశుధ్యం పై ప్రజల అప్రమత్తత అవసరమని మున్సిపల్ కమిషనర్ పార్వతినేని శ్రీధర్ తెలిపారు. బుధవారం పిడుగురాళ్ల పట్టణంలోని మెయిన్ రోడ్ లో మున్సిపల్ కార్మికుల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా, షాపు యజమానులు డస్ట్ బిన్లు ఏర్పాటు చేసి తడి, పొడి చెత్తను వేరు చేయాలని కోరారు. మున్సిపల్ కార్మికులు ఈ విధంగా సమకూర్చిన చెత్తను తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంటారని చెప్పారు. వ్యాపారస్తులు సహకరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్