అమరావతి రాజధాని కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్లో 15 వేల కోట్లు కేటాయించడం శుభ పరిణామమని జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధాని అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. గతంలో వైసిపి ప్రభుత్వం బటన్ నోక్కటమే పాలనగా సాగించిందని విమర్శించారు.