పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించండి: కమిషనర్ రమేష్ బాబు

66చూసినవారు
పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించండి: కమిషనర్ రమేష్ బాబు
గుంటూరు జిల్లా పొన్నూరు మున్సిపల్ కమీషనర్ యం. రమేష్ బాబు, డి ఈ యం. ఏడుకొండలు శుక్రవారం పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. భావనగర్ కాలనీ 1వ వార్డు, డి. ఆర్. కె కాలనీ 14వ వార్డు, ఆంజనేయస్వామి గుడి వద్ద, నేతాజీ నగర్ 17వ వార్డు, శాంతినగర్ 19వ వార్డులు పరిశీలించి శానిటేషన్ నిర్వహణపై సిబ్బందికి సూచనలు జారీ చేశారు. వార్డ్ సచివాలయ శానిటరీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్