ఆటో బోల్తా.. ఒకరు మృతి

57చూసినవారు
ఆటో బోల్తా.. ఒకరు మృతి
నూజెండ్లలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఐనవోలు ఎస్ఐ కృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం.. నూజెండ్ల మండలం పమిడిపాడు నుంచి వినుకొండ వస్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పమిడిపాడుకి చెందిన కోటిలింగం (70) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పలువురు గాయపడ్డారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్