
వినుకొండ: గౌరవం పెంచేలా ఈసారి అసెంబ్లీ నిర్వహణ: ఎమ్మెల్యే
రాష్ట్ర శాసనసభా గౌరవం పెంచేలా ఈసారి అసెంబ్లీ నిర్వహణ ఉంటుందని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. అందుకోసమే ఈనెల 22, 23 తేదీల్లో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో విప్లు అందరితో సమావేశం నిర్వహించారు. అవగాహన సదస్సులకు లోక్ సభ స్పీకర్ హాజరవుతారని అన్నారు.