రషీద్ హత్య కేసులో పిటిషన్ దాఖలు చేసిన పొన్నవోలు

54చూసినవారు
వినుకొండ పట్టణంలో జులై 17న జరిగిన రషీద్ హత్య కేసులో కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు గురువారం మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. రషీద్ హత్య వెనుక నుంచి నడిపించిన వారి పేర్లను కేసులో పోలీసులు నమోదు చేయలేదన్నారు. ప్రధాన నిందితుల పేర్లను కేసులో నమోదు చేయాలని వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సుధాకర్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్