AP: ఓటమికి కారణాలు వెతుకుతున్న వైసీపీ నేతలు.. ఈసీ, పోలీసుల తీరుపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. ఇవాళ టీడీపీ ముఖ్యనేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 1న కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వాలని నేతలను చంద్రబాబు ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. శుక్రవారం పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో చంద్రబాబు సమావేశం కావాలని నిర్ణయించారు.