అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ను ప్లాస్టిక్ రహిత జోన్గా తీర్చిదిద్దడంపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. జులై నెలాఖరులోగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ను ప్లాస్టిక్ రహితంగా మార్చాలని సీఎస్ నిర్ణయించారు. ఇందుకు వీలుగా టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రిజర్వ్ పరిధిలోని 4 ప్రాంతాల్లోని ప్రజల తరలింపు వేగవంతం చేయాలని సీఎస్ అధికారులకు సూచించారు.