బీహార్లో వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు తెరుచుకున్నాయి. అయితే బుధవారం ఉష్ణోగ్రత 47 డిగ్రీలు దాటడంతో పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు ఎండ వేడిని తట్టుకోలేక అల్లాడిపోయారు. ఈ మేరకు షేక్పురా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 16 మంది బాలికలు స్పృహతప్పి పడిపోయారు. టీచర్లు వారికి సపర్యలు చేసి ఆటోలు, బైక్లపై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.