ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలింది. నిన్న రావులపాలెంలో జరిగిన టీడీపీ ప్రజాగళం సభలో చంద్రబాబు వ్యాపారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కిరాణా దుకాణాల్లో వ్యాపారులు గంజాయి అమ్ముతున్నారంటూ ఆరోపించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై ఆర్యవైశ్య సంఘాలు మండిపడ్డాయి. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. శుక్రవారం రావులపాలెం బంద్కు పిలుపునిచ్చారు.