తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తుర్కయంజాల్కు చెందిన తిరుపతి అనురాగ్ (27) అనే యువకుడు డ్రగ్స్కు బానిసై.. మత్తులో ఇంటికి వచ్చి తండ్రితో గొడవకు దిగేవాడు. దీంతో తన తండ్రి నిన్న కొడుకును మందలించాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో తండ్రిని హత్య చేసి.. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.