AP: ఉప సర్పంచ్లు, MPP, ZP చైర్మన్కు జరుగుతున్న ఉపఎన్నికల ఫలితాలు కొలిక్కి వస్తున్నాయి. కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా లోకల్ బాడీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. మెజారిటీ స్థానాల్లో వైసీపీ పట్టునిలుపుకుంది. ఈ క్రమంలో కడప జడ్పీ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకుంది. కాకినాడ రూరల్లో జనసేన పాగా వేసింది. వైఎస్ MPP ఎన్నికలకు కొన్ని చోట్ల కోరం సరిపోనందున శుక్రవారానికి వాయిదా వేశారు.