ఏపీ ప్రభుత్వం ఆదివారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో గత వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ జీవో విడుదల చేసింది. రాష్ట్ర కేబినెట్ ఆమోదం మేరకు త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.