సామాజిక పింఛన్లను ఇంటింటికీ వెళ్ళి పంపిణీ చేయలేమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తేల్చేశారు. ఏప్రిల్లో చేసినట్లుగానే మే నెలలోనూ పింఛన్ల పంపిణీ ఉంటుందని ఎన్నికల కమిషన్కు స్పష్టం చేశారు. 'ఇంటింటికీ పింఛను పంపిణీ’ అవకాశాలపై ఇప్పటికే సెర్ప్ అధికారులతో, కలెక్టర్లతో సమీక్షించామని.. అది సాధ్యంకాదనే నిర్ణయానికి వచ్చామని తెలిపారు. నడవలేని వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే ఇంటివద్ద పింఛను ఇస్తున్నారు.