దక్షిణ భారతదేశం నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మాత్రమే నీరు ఉందని కేంద్ర జలసంఘం (CWC) పేర్కొంది. CWC పర్యవేక్షణలో ఉన్న 42 రిజర్వాయర్ల సామర్థ్యం 53.334 శతకోటి ఘనపు మీటర్లు (BCM).. కాగా 8.865 BCM మాత్రమే నీరు ఉంది. సాగు, తాగునీరు, జలవిద్యుదుత్పత్తికి పొంచి ఉన్న సవాళ్లను ఇది స్పష్టం చేస్తోంది. దేశ ఉత్తర, మధ్యభాగాల్లోనూ లోటు కనిపిస్తోంది.