పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఏర్పాటు చేసిన 'రా.. కదలిరా' సభలో
టీడీపీ చీఫ్ చంద్రబాబు వాడీవేడిగా ప్రసంగించారు. జిల్లాలో ఏ ఒక్క రోడ్డయినా బాగుందా, ఏ కాలువ అయినా పూడిక తీశారా, ఏ డ్రైనేజిలో అయినా పూడిక తీశారా? అని ఫైర్ అయ్యారు. అందుకే రజనీకాంత్ డైలాగ్ చెబుతున్నా.. రాజా ఇప్పటికైనా అర్థమైందా? అంటూ తలైవా డైలాగ్ సంధించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి భూస్థాపితం చేయాలన్నారు.