ఓటర్ల జాబితా ఇంటింటి సర్వే పూర్తి చేయండి

63చూసినవారు
ఓటర్ల జాబితా ఇంటింటి సర్వే పూర్తి చేయండి
చిత్తూరు స్పెషల్ సమ్మరీ రివిజన్ -2025లో భాగంగా ఓటర్ల జాబితా ఇంటింటి సర్వేను వందశాతం పూర్తి చేయాలని, చిత్తూరు ఆర్డీవో చిన్నయ్య, కమిషనర్ పి.నరసింహ ప్రసాద్ ఎన్నికల సూపర్వైజర్ అధికారులను ఆదేశించారు. బుధవారం నగరపాలక కార్యాలయంలో ఎన్నికల సూపర్వైజర్ అధికారులతో స్పెషల్ సమ్మరీ రివిజన్ -2025పై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్రీ రివిజన్ కార్యక్రమాల్లో భాగంగా ఓటర్ల జాబితా ఇంటింటి సర్వేను రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్