ఆందోళనలో మామిడి రైతులు

69చూసినవారు
ఆందోళనలో మామిడి రైతులు
చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు పంటకు సరైన ధర అందకపోవడంతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం టన్ను రూ. 28వేలు పలికిన తోతాపురి మామిడి రకం తాజాగా రూ. 24వేలకు పడిపోయింది. ర్యాంపు వ్యాపారులు, పండ్లగుజ్జు పరిశ్రమల నిర్వాహకులు సిండికేట్ గా ధరలు తగ్గిస్తున్నారని రైతులు శనివారం వాపోయారు. కలెక్టర్ తమకు న్యాయం చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్