మొక్కలతోనే మానవులు, ఇతర జీవుల మనుగడ సాధ్యమవుతుందని సహాయ కమిషనర్ ఎ.ప్రసాద్ చెప్పారు. నగర కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ ఆదేశాల మేరకు.. స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమంలో భాగంగా బుధవారం కొంగారెడ్డిపల్లి పూల మార్కెట్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. స్థలాన్ని శుభ్రం చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిశుభ్రత, పచ్చదనాన్ని పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.