ప్రజలు డ్రగ్స్ కు దూరంగా ఉండాలి - డి.ఎస్.పి

70చూసినవారు
ప్రజలు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని మదనపల్లె డిఎస్పి ప్రసాద్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని బుధవారం మదనపల్లెలో పోలీసులు నిర్వహించారు. స్థానిక 2టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి బెంగళూరు బస్టాండు వరకు పోలీసులు, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డి. ఎస్. పి మాట్లాడుతూ. ప్రజలు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారంటే భవిష్యత్తును నాశనం చేసుకున్న వారవుతారని తెలిపారు.

సంబంధిత పోస్ట్