విద్యార్థులకు భోజనం ప్లేట్లు వితరణ

78చూసినవారు
విద్యార్థులకు భోజనం ప్లేట్లు వితరణ
నగరి: మున్సిపల్‌ పరిధి ఏకాంబరకుప్పం మండలపరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం రజనీకాంత్‌ అనే దాత 200 మంది విద్యార్థులకు రూ. 20 వేలు విలువచేసే భోజనం ప్లేట్లను వితరణగా అందించారు. మంగళవారం పాఠశాలకు వెళ్లిన ఆయన ప్రధానోపాధ్యాయులు విఎస్‌ హరిదాస్‌ సమక్షంలో ప్లేట్లను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు మోహన్, మురళి, శ్రీకాంత్, పొన్నప్పన్, షణ్ముగం, నాగేంద్రన్, రవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్