పట్టణ పరిధి కశింమిట్ట వేల్నగర్లో నూతనంగా నిర్మించిన మహామునేశ్వర ఆలయ కుంభాభిషేక వేడుకలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గణపతి హోమం, నవగ్రహ హోమం, లక్ష్మీహోమం పూర్ణాహుతి నిర్వహించారు. కుంభాలంకార కార్యక్రమం నిర్వహించారు. మొదటి కాలయాగ పూజలను చేపట్టి ధీపారాధన చేసి విచ్చేసిన భక్తులకు ప్రసాదాలు పంఫిణీ చేశారు.