రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు

52చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు
ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డ సంఘటన బంగారుపాలెం మండలంలో సోమవారం రాత్రి జరిగింది. కొదలమడుగు గ్రామానికి చెందిన మేస్త్రీ మహేశ్, టేకుమంద గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం బంగారుపాళ్యం నుంచి స్వగ్రామాలకు బైక్ పై బయలుదేరారు. చిత్తూరు-పలమనేరు హైవేలోని తమిళనాడు డాబా హోటల్ వద్ద వెనుక వస్తున్న కారు ఢీకొంది. గాయపడిన వారిని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్