సంక్షేమ హాస్టల్లో వైద్య శిబిరం నిర్వహణ

75చూసినవారు
సంక్షేమ హాస్టల్లో వైద్య శిబిరం నిర్వహణ
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని సంక్షేమ హాస్టల్లోని విద్యార్థులు అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ జయేష్ సూచించారు. ఈ సందర్భంగా పట్టణంలోని గిరిజన సంక్షేమ హాస్టల్లో బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారి విద్యార్థులతో మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చునని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్