158 పర్యాటకులను రక్షించిన అధికారులు

53చూసినవారు
158 పర్యాటకులను రక్షించిన అధికారులు
సిక్కింలో వరదల కారణంగా చిక్కుకున్న 158 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. దీంతో సహాయక చర్యలు ముగిశాయన్నారు. గత మూడు రోజుల్లో 1,447 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు మంగన్ జిల్లా మేజిస్ట్రేట్ హేమ్ కుమార్ చెత్రీ తెలిపారు. చివరి రోజు మిగిలిన 158 మంది పర్యాటకులను రక్షించామన్నారు. భారీ వర్షాల వల్ల పర్యాటకులు చిక్కుకుపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్