ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తే చర్యలు తప్పవు: సిఐ

72చూసినవారు
ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తే చర్యలు తప్పవని పుంగనూరు సీఐ రాఘవరెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి ఆయన మాట్లాడుతూ నామినేషన్ల పర్వం ముగిసిన సందర్భంగా పట్టణంలో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలందరూ ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సిఐ కోరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్