గజవాహనంపై ఊరేగిన అలిమేలుమంగమ్మ

78చూసినవారు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు బుధవారం సాయంత్రం గజవాహనంపై నాలుగు మాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. అమ్మవారి జన్మనక్షత్రం ఉత్తరాషాఢ సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి, నిత్య కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం విశేషాలంకరణలో అమ్మవారు గజవాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్