ఎర్రావారిపాళెం మండలంలోని చింతగుంట పంచాయితీని ఆదర్శ పంచాయితీగా తీర్చిదిద్దుతానని చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. మంగళవారం చింతగుంట పంచాయితీ, పసుపులేటి వారిపల్లిలో మాటామంతీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ టీడీపీ విధేయుడు బెంగుళూరి రమేష్ మృతికి సంతాపం తెలిపారు.