బంగారు తిరుచ్చి పై సిరుల తల్లి

68చూసినవారు
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారు శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచ్చిపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. వారపు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలోని శ్రీకష్ణముఖమండపంలో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. సాయంత్రం విశేషంగా అలంకరించి బంగారు తిరుచ్చిపై కొలువుదీర్చి నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు.

సంబంధిత పోస్ట్