శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమం

68చూసినవారు
శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమం
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం సాయంత్రం వైఖానస ఆగమోక్తంగా జరిగిన ధ్వజారోహణంతో ముక్కోటి దేవతలను ఉత్సవాలకు ఆహ్వానం పలికారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. అంతకు ముందు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్