బంగారు తిరుచ్చిపై దర్శనమిచ్చిన శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి

70చూసినవారు
బంగారు తిరుచ్చిపై దర్శనమిచ్చిన శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి
చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా లక్ష్మి భూదేవి సమేత స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని కనుల పండుగగా దర్శించుకొని హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఏఈఓ ఎమ్. గోపీనాథ్, టెంపుల్ ఎలక్ట్రికల్ డిప్యూటీ ఇంజనీర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్