కారు, బస్సు ఢీ.. ఇద్దరికీ గాయాలు

57చూసినవారు
కారు, బస్సు ఢీ.. ఇద్దరికీ గాయాలు
చిత్తూరు జిల్లా గుడిపాల మండలం నరహరిపేట చెకోపోస్ట్ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేలూరు నుంచి చిత్తూరు వెళ్తున్న కారును, చిత్తూరు నుంచి వేలూరు వెళుతున్న భారతి బస్సు ఢీకొన్నాయి. కారులోని ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనం ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్