కారు బోల్తా, 8 మందికి గాయాలు

74చూసినవారు
చిత్తూరు జిల్లా తేనెబండ క్రాస్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తులు కారులో తిరుమలకు వెళ్లారు. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. ఈక్రమంలో తేనెబండ క్రాస్ వద్దకు రాగానే కారు టైరు పేలింది. దీంతో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్